గుంటూరు పట్టణంలోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ నేతలతో ఎమ్మెల్యే నసీర్ పెన్షన్ పంపిణీ పై శనివారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ జులై 1వ తేదీన పెన్షన్ పంపిణీ ఓ పండుగలా జరగాలని, నాయకులంతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పాల్గొన్నారు.