సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు నగర కమిషనర్ కీర్తి బుధవారం తెలిపారు. వర్షాకాలంలో దోమలు వృద్ధి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది అన్ని డివిజన్లలో పర్యటించారు. దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సీజనల్ వ్యాధుల ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.