గుంటూరు జిల్లాలో చిన్నారులకు, గర్భిణీలకు బాలింతలకు అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం సక్రమంగా అందించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన కార్యాలయంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతల ఆరోగ్యంను ఆశా, ఏఎన్ఎం, మహిళా పోలీసులను సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.