గుంటూరు జిల్లాలో పనిచేసిన 9 మంది పోలీసులు బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ సతీశ్ కుమార్ అతిధిగా హాజరయ్యారు. ఉద్యోగ విరమణ చేసిన తొమ్మిది మంది పోలీసులకు ఎస్పీ శాలువా కప్పి సత్కరించారు. పోలీస్ శాఖలో వారు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు.