పల్నాడు జిల్లా రైతుల సమస్యల గురించి ఎమ్మెల్యేలు, ఎంపీ వెంటనే స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. నరసరావుపేటలో ఆయన శనివారం తమ కార్యాలయంలో మాట్లాడుతూ. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులు లేనిదే దేశం లేదు అని ఆయన అన్నారు.