దాచేపల్లి తహశీల్దార్ గా శ్రీనివాస్ యాదవ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈయన గతంలో కారంపూడి, అచ్చంపేట మండలాలల్లో పనిచేశారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తూ వేగంగా ప్రజలకు సేవలందిస్తానని చెప్పారు. కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయనకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు.