దాచేపల్లి పట్టణంలోని ప్రియదర్శిని లాడ్జ్ వద్ద అద్దంకి నార్కెట్ పల్లి హైవే పై గురువారం రాత్రి ఆగి ఉన్న ట్రాక్టర్ ను ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహన దారుడికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రున్ని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.