మాచవరం మండలం, కొత్తపాలెంలో కోడలిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు నర్సయ్యను శుక్రవారం పోలీసులు పిడుగురాళ్ల జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతడికి 15 రోజుల రిమాండ్ విధించినట్లు మాచవరం పోలీసులు తెలిపారు. అనంతరం ఆ నిందితున్ని గురజాల సబైజైలుకు తరలించారు. ఎవరైనా అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.