సైప్రస్ దేశంలో రోడ్డు ప్రమాదం.. గురజాల యువకుడు మృతి

68చూసినవారు
సైప్రస్ దేశంలో రోడ్డు ప్రమాదం.. గురజాల యువకుడు మృతి
సైప్రస్ దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గురజాలకు చెందిన యువకుడు మృతి చెందాడు. 18 నెలల క్రితం ఉన్నత విద్య కోసం నల్ల పేరయ్య కుమారుడు నల్ల నవీన్ సైప్రస్ వెళ్లాడు. అక్కడే పార్ట్టైమ్ జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నాడు. శుక్రవారం సైప్రస్లో జరిగిన రోడ్డుప్రమాదంలో నవీన్ మృతి చెందాడు. మృతదేహాన్ని స్వదేశం తీసుకువచ్చేలతీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నవీన్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్