ఉన్నతాధికారుల సూచనల మేరకు మాచర్ల మండలం హసనాబాద్ తండా గ్రామం లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా 8 మంది అనుమానిత వ్యక్తులు, నలుగురు పాత నిందితులను మాచర్ల మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి బైండోవర్ కేసులను నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటరమణ తెలిపారు.