దుర్గి మండలం ముత్తుకూరు గ్రామంలో ఎంతో ప్రాముఖ్యమైన ఆంధ్ర ఇవాంజలికల్ క్రీస్తు లూథరన్ దేవాలయమును ఆదివారం దుర్గి మండల తహశీల్దార్ రజనీకుమారి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమంలో దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ను పాస్టర్లు, సేవా సంఘం నాయకులు సత్కరించారు.