మాచర్లలోని పార్క్ సెంటర్లో పలనాటి బ్రహ్మనాయుడు విగ్రహానికి గురువారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలనాటి చరిత్రలో కీలక భూమిక పోషించిన బ్రహ్మనాయుడు చరిత్ర నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బ్రహ్మనాయుడు చరిత్ర మరవలేనిదని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు.