రాష్ట్రంలో పోలవరం, అమరావతి నిర్మాణాలను సర్వనాశనం చేసి, ఐదేళ్ల పాటు జగన్ విధ్వంసకర రాజకీయాలకు తెర తీశారని శనివారం ఎమ్మెల్యే జూలకంటి విమర్శించారు. మాచర్ల టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా యువతను, ఉద్యోగులను దగా చేశారని మండిపడ్డారు. అన్ని వర్గాల వారిని హింసించి, ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారని ఆయన చెప్పారు.