మాచర్ల మండలం, గన్నవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ సీతా సమేత కోదండరామస్వామి వారి ఆలయంలో ధ్వజస్తంబం పున: ప్రతిష్ఠ కార్యక్రమాలు వారం రోజులు పాటు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. శుక్రవారం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న యజ్ఞయగాదులను తిలకించి, హోమగుండంలో నవ ధాన్యాలు, ఆవు నెయ్యిను హవిస్సులుగా వదిలారు.