దుర్గి గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న సందర్భంగా ఎస్ఐ కోటయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దుర్గి గ్రామంలో వీధి వీధిన పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై కోటయ్య మాట్లాడుతూ కౌంటింగ్ రోజున ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారి పైన కఠిన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు.