ప్రకృతి వ్యవసాయంతోనే రైతాంగం ఆర్ధిక ప్రగతిని సాధించవచ్చునని ఎమ్మెల్యే జూలకంటి పేర్కొన్నారు. రెంటచింతలలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, సింథటిక్ పురుగు మందులు, రసాయనాలతో కూడిన ఎరువుల వాడకాన్ని రైతులు సాధ్యమైనంత వరకు తగ్గించి. , ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గుచూపాలని కోరారు. దుక్కుల సమయంలోనే మట్టి నమూనాలు సేకరించి, వ్యవసాయశాఖ నిపుణులు సూచనలు మేరకు సహజ సిద్ధమైన ఎరువులను భూమిలో జల్లుకోవాలని సూచించారు.