రైతాంగం ప్రకృతి వ్యవసాయంతోనే ఆర్ధిక ప్రగతిని సాధించవచ్చునని మాచర్ల శాసస సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. శుక్రవారం రెంటచింతల మండల కేంద్రం, గుంటూరు హైవే పక్కన ఓ వ్యవసాయ క్షేత్రంలో వివిధ వ్యవసాయ అనుబంధం అంశాలపై మండల వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కమ్యూనిటీ మేనేజ్డ్ ప్రకృతి వ్యవసాయాన్ని అందరూ ప్రోత్సహించాలని ఎమ్మెల్యే అన్నారు.