దుగ్గిరాల మండలం పేరుకలపూడిలో ఇద్దరు వ్యక్తుల మధ్య స్వల్ప వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఎస్ఐ వెంకట రవి తెలిపిన వివరాల ప్రకారం.. సీతారామరాజు, శ్రీహరి మధ్య జరిగిన వాగ్వాదం క్రమేనా తీవ్రరూపం దాల్చింది. కోపంతో శ్రీహరి రాయితో సీతారామరాజుపై దాడి చేశాడు. గాయపడిన సీతారామరాజు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.