మంగళగిరి ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీ పట్టణంలో జగన్నాథ రధయాత్ర నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధి సువర్ణ శ్రీనివాసదాసు తెలిపారు. మంగళగిరి బైపాస్ లోని బాపూజీ విద్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 3వేల జగన్నాధ రధయాత్రలు నిర్వహించటం జరుగుతుందన్నారు. అందులో భాగంగా 11వ తేది జరిగే కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరవుతారని అన్నారు.