మోకాటి లోతు నీటిలో దిగి ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించిన లోకేష్

84చూసినవారు
మంగళగిరిలోని రత్నాల చెరువులో మోకాటి లోతు నీళ్ళలో దిగి ముంపునకు గురైన ఇళ్లను మంత్రి లోకేష్ ఆదివారం పరిశీలించారు. మసీదు లైన్లో చేనేత కార్మికుని ఇంటికి వెళ్లి నీట మునిగిన మగ్గాన్ని తనిఖీ చేశారు. ఇళ్ల మధ్య నిలిచిన నీటిని మోటార్లతో తోడించాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల వాసులుకు ఆహారం, తాగునీరు అందించాలని మంత్రి లోకేష్ సూచించారు.

సంబంధిత పోస్ట్