యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపికైన రామ్మోహన్ నాయుడుకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. ఈ గుర్తింపు దేశానికి, ముఖ్యంగా తెలుగువారికి గర్వకారణమని.. ప్రజాసేవలో రామ్మోహన్ అంకితభావం యువతకు స్ఫూర్తినిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపిక కావడం ఏపీకి, భారత్కు గర్వకారణమని మంత్రి లోకేశ్ అన్నారు.