అమరావతికి సంబంధించిన వివాదాస్పద కేసులో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును తుళ్లూరు పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి మంగళవారం గుంటూరు జిజిహెచ్ లో వైద్య పరిక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనని మంగళగిరి కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఈ నెల 24 వరకు ఆయన రిమాండ్లో ఉండనున్నారు.