మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి సీఐడీ అధికారులు సజ్జల రామకృష్ణారెడ్డిని శుక్రవారం విచారించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు హాజరయ్యానని, గతంలోనూ ఒకసారి హాజరయ్యానని తెలిపారు. టీడీపీ నేత పట్టాభి ఎలా మాట్లాడారో అందరికీ తెలుసని, దాడులకు తమ నాయకుడు జగన్ వ్యతిరేకమని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.