మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట గురువారం మున్సిపల్ కార్మికులు, క్లాప్ ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. పెండింగ్ ఉన్న వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్, సెలవులు, యూనిఫామ్, చెప్పులు, సబ్బులు, నూనెలు వంటి అవసరాలను కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అడిషనల్ కమిషనర్ సమస్యలపై స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ధర్నాలో సీఐటీయూ నాయకులు, క్లాప్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.