మే 2న అమరావతిలో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి గురువారం అధికారులను ఆదేశించారు. రోడ్ షో, ప్రధాన సభ ప్రాంతంలో శానిటేషన్, సుందరీకరణ, సీటింగ్, మంచినీరు, స్నాక్స్ వంటి ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అధికారులు ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని తెలిపారు.