భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసులు గురువారం రాత్రి విస్తృత తనిఖీలు చేపట్టారు. పట్టణ సీఐ డి. వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కాళీమాత ఆలయం ఎదుట, గౌతమ బుద్ధ రోడ్డుపై వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానితులను విచారించారు. గుంటూరు అర్బన్ ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు సీఐ తెలిపారు.