తాడేపల్లి మండలం కుంచనపల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళగిరికి చెందిన బీటెక్ విద్యార్థి దినేష్ కార్తీక్ (21) అక్కడికక్కడే మృతి చెందాడు. తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కార్తీక్ నడుపుతున్న బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. రెండు రోజుల క్రితమే కార్తీక్ కొత్త బైక్ కొనుకున్నట్లు అతని స్నేహితులు చెప్పారు. మృతదేహాన్ని మణిపాల్ హాస్పిటల్కు తరలించారు.