తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోకో, పామాయిల్, పొగాకు రైతులు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు వైసీపీ అండగా ఉంటుందని జగన్ తెలిపారు.