గుంటూరు జిల్లా నుండి క్యాబినెట్ లో ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. టీడీపీ నుండి లోకేష్ కి, జనసేన నుండి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కి క్యాబినెట్లో చోటు దక్కింది. మనోహర్ రాష్ట్ర శాసనసభా స్పీకరుగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు కుమారుడుడైన మనోహర్ అక్టోబర్ 2018లో జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీచేసి ఓడిపోయి 2024లో అక్కడే విజయం సాధించారు.