పల్నాడు జిల్లాలో మహాత్మ జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి వేడుకలు

54చూసినవారు
పల్నాడు జిల్లాలో మహాత్మ జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి వేడుకలు
మహాత్మ జ్యోతిరావ్ పూలే 134వ వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాల మహానాడు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా, పూలే అనేక సామాజిక ఉద్యమాల నేతగా, మహిళలకు విద్యా అవకాశాలు, సమాన హక్కులు కావాలని పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయన భార్య సావిత్రిబాయి పూలే కూడా మహిళల విద్య కోసం చేసిన కృషిని ప్రశంసించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్