విజయవాడ బాలోత్సవ భవన్లో జూన్ 29న ఎంసీపీఐ(యు) ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో "వర్తమాన రాజకీయాలు – కమ్యూనిస్టుల ఐక్యత సామాజిక న్యాయం అంశంపై సెమినార్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నరసరావుపేటలో సెమినార్కు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మద్ది కాయల ఓంకార్ శతజయంతిని ఘనంగా నిర్వహించాలని పార్టీ నేత తూమాటి శివయ్య పిలుపునిచ్చారు.