నరసరావుపేట: 10,164 మందికి అక్షరాస్యుల్ని చేశాం

58చూసినవారు
నరసరావుపేట: 10,164 మందికి అక్షరాస్యుల్ని చేశాం
2024-25 లో ఉల్లాస్ కార్యక్రమం మొదటి విడత ద్వారా జిల్లాలో చదవడం, రాయడం రాని 10,707 మందిని అక్షరాస్యులను చేశామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం వెల్లడించారు. 2025-26 విద్యా సంవత్సరంలో 30వేల మంది విధాన, ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యులను తయారు చేయాలని అధికారులకు లక్ష్యంగా నిర్దేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఉల్లాస్ పథకంపై జిల్లా స్థాయి కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్