అస్తవ్యస్తంగా నరసరావుపేట డ్రైనేజీ వ్యవస్థ.!

52చూసినవారు
నరసరావుపేట పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల కురిసిన తక్కువ వర్షానికే మురుగు నీరు రోడ్లపైకి వెల్లివచ్చింది. ఇది కాలువలు ఆక్రమించబడిన కారణమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ప్రజాసంఘాల నాయకులు పట్టణంలోని బాలయ్య నగర్-పల్నాడు రోడ్, ఎస్ఎన్ కాలేజీ, రెడ్డి కాలేజీ ప్రాంతాల్లో కాలువలను పరిశీలించారు. తుఫాన్లు, భారీ వర్షాలు వస్తే పరిస్థితి మరింత విషమమవుతుందని నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్