నరసరావుపేట మండలం పెట్లూరువారి పాలెం గ్రామం నందు శుక్రవారం మండవ వెంకట కోటమ్మ స్మరక నూతన బస్సు షెల్టర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డచదలవాడ అరవింద బాబు పాల్గొని ప్రారంభించారు. బస్సు షెల్టర్ ఏర్పాటు చేసిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పెట్లూరివారి పాలెం గ్రామ ప్రజలు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.