నరసరావుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు నియోజకవర్గంలోని ప్రజల వద్ద నుండి వినతి పత్రాలను అందుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రజా దర్బార్ లో 14 అర్జీలను స్వీకరించడం జరిగింది అని తెలిపారు. అర్జీదారుల సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.