ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి ద్వారకా తిరుమల రావు ని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని డిజిపి కార్యాలయంలో శనివారం ద్వారకా తిరుమల రావుని కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా పల్నాడులోని పలు ముఖ్యమైన అంశాలపై డిజిపితో శ్రీకృష్ణదేవరాయలు చర్చించారు.