గత 12 రోజులుగా నరసరావుపేట గాంధీ పార్క్లో ధర్నా చేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉద్యోగులను శుక్రవారం ప్రజాసంఘాల నేతలు కలిసి సంఘీభావం తెలిపారు. 361 సెంటర్లలో 6 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని, ఇపిఎఫ్ సౌకర్యం, అద్దె బకాయిలు చెల్లించి 23% ఫిట్మెంట్, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలందుబాటులో ఉండేందుకు ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు.