నరసరావుపేట: రహదారులపై ఎవరైనా కట్టడాలను తొలగించాలి

73చూసినవారు
నరసరావుపేట: రహదారులపై ఎవరైనా కట్టడాలను తొలగించాలి
నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలోని ఆక్రమణ దారులకు కమిషనర్ ఏం. జస్వంత్ రావు హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల 21వ తేదీలోపు స్వచ్ఛందంగా ఫుట్ పాత్లు, డ్రైన్లపై, రోడ్డు మార్జిన్లలో అనధికారక బోర్డులు ఏర్పాటు చేసిన వారు, వ్యాపారాలు చేసే వారు ఖాళీ చేయాలన్నారు. డ్రైన్ల ఆక్రమణతో మురుగునీరు నిలిచిపోతుందన్నారు. 21 తర్వాత పోలీసుల సహకారంతో ఆక్రమణలు తొలగించే కార్యక్రమం చేపడతామని కమిషనర్ జస్వంత్ రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్