సీఎం చంద్రబాబు నాయుడు, కార్యదర్శి ప్రద్యుమాని కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. నరసరావుపేట పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. రహదారులను విస్తరణ చేసేందుకు తగిన సహాయ, సహకారాలు అందించాలని కోరారు. జేఎన్టీయూ కాలేజీని యూనివర్సిటీగా మార్చాలని, కాకాని గ్రామం ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయాలని కోరారు.