నేర ఘటనల్లో ఆధారాల సేకరణలో ఖచ్చితత్వం ఉంటేనే నిందితులకు శిక్ష పడుతుందని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులకు ఫోరెన్సిక్ సాక్ష్యం సేకరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. దర్యాప్తులో పాటించాల్సిన మెళకువలు, న్యాయస్థానానికి ఆధారాలు సమర్పించే విధానంపై ఆయన వివరించారు. సరైన ఆధారాలతోనే నేరస్తులకు శిక్ష పడుతుందని ఎస్పీ పేర్కొన్నారు.