2024-2025 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ లేకుండా ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్నులు చెల్లించుటకు జూన్ 30తో గడువు ముగుస్తుందని శనివారం నర్సరావుపేట మున్సిపల్ కమీషనర్ రవిచంద్ర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పట్టణంలోని పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆదివారం సెలవు దినం అయిన మున్సిపల్ కార్యాలయంలో పన్నులు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేసామన్నారు.