పల్నాడు: విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు

77చూసినవారు
పల్నాడు: విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు
ఇటీవల విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో పిడుగురాళ్ల నారాయణ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మూడవ అత్యధిక మార్కులు, జిల్లా స్థాయిలో ప్రథమ అత్యధిక మార్కులు సాధించడం అభినందనీయం అని పల్నాడు జిల్లా కలెక్టర్ పీ. అరుణ్ బాబు అన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థులు చదువులో మరింతగా రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ సత్కరించారు.

సంబంధిత పోస్ట్