బైకు టైరులో చీర ఇరుక్కొని మహిళ మృతి

51చూసినవారు
బైకు టైరులో చీర పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్తుండగా సాతులూరు సమీపంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో కారంపూడి మండలం శనగల్లు గ్రామానికి చెందిన కుమారి(25) మృతి చెందింది. గుంటూరులో ఉండే తాము క్రోసూరు వెళ్లి తిరిగి వెళ్తుండగా ఘటన జరిగినట్లు మృతురాలి భర్త తెలిపారు. బంధువుల సహాయంతో మృతదేహాన్ని నరసరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్