అసాంఘిక కార్యకలాపాల గుర్తింపునకు పోలీసులు డ్రోన్లను ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంకొల్లు ఎస్సై సురేష్ గురువారం రాత్రి డ్రోన్ సాయంతో నాగులపాలెం చెరువు వద్ద పెద్ద సంఖ్యలో యువకులు బహిరంగంగా మద్యం సేవిస్తున్నట్లు గుర్తించి మెరుపు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే చీరాల వన్ టౌన్ సీఐ సుబ్బారావు కూడా పట్టణంలోని రద్దీ ప్రాంతాలలో డ్రోను ను ఎగరవేసి పరిస్థితులను సమీక్షించారు.