ఇంటర్నేషనల్ ఇండో- నేపాల్ టీ 20 ఛాంపియన్షిప్ క్రికెట్ పోటీలకు ఇంకొల్లు మండలం నాగండ్ల గ్రామానికి చెందిన యువకుడు సంతోష్ ఎంపికయ్యాడు. ఈ మేరకు శనివారం అతనికి ఆల్ ఇండియా క్రికెట్ ట్రస్ట్ అసోసియేషన్ నుండి ఎంపిక పత్రం అందింది. మే 26 నుంచి 31 వరకు నేపాల్ లో జరగనున్న సిరీస్ లో సంతోష్ ఇండియా తరుపున ఆడనున్నాడు. సంతోష్ ను గ్రామస్తులు అభినందించారు.