మార్టూరులోని క్యాంపు కార్యాలయం నందు సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని సమస్యలపై వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అర్జీలను అధికారులకు పంపించి వెంటనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే సాంబశివరావు ప్రజలకు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.