గోకులం పథకం ద్వారా పాడి పరిశ్రమను ప్రోత్సహించడం, పాడి రైతులకు ఆర్ధికంగా సాయం అందించడం పశువుల ఆరోగ్య సంరక్షణ, పాల ఉత్పత్తిని పెంచడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం అని పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ తెలిపారు. శనివారం క్రోసూరు మండలంలోని అందుకూరు గ్రామంలోని గోకులం షెడ్డు ను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గోకులం పథకాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్ధికంగా అభివృద్ధి చెందాలన్నారు.