రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) కార్యాలయాలు ప్రారంభిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ వెల్లడించారు. గురువారం అమరావతిలో ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. అంటే జులై 2024 నుంచి 2025 వరకు ఈ ప్రొక్యూర్మెంట్ ఫ్లాట్ఫామ్ ద్వారా 55,486 టెండర్లు ప్రచురించబడ్డాయని తెలిపారు.