పెదకూరపాడు మండలంలో 7818 ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటింటికి తిరిగి పంపిణీ చేయనున్నట్లు పెదకూరపాడు ఎంపీడీవో మల్లేశ్వరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెదకూరపాడు మండలంలో ఉన్న 14 సచివాలయాలకు ఐదు కోట్ల 36 లక్షల 20 వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం వారు జమ చేసినట్లు వివరించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జూలై ఒకటో తేదీన అన్ని గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి పంపిణీ జరుగుతుందన్నారు.