క్రోసూరు: మంచినీరు కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు

80చూసినవారు
క్రోసూరు మండలం, దొడ్లేరులో మంచినీరు లేకపోవడంతో గ్రామస్థులు గురువారం ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. ఏడాది నుంచి తమకు మంచినీరు నిలిపివేశారని మండిపడ్డారు. వేసవికాలం కావడంతో కనీసం బోర్ల నుంచి నీరు కూడా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో నిరుపయోగంగా రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయని అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పోలీసులు వారితో మాట్లాడి నిరసన విరమింప చేశారు.

సంబంధిత పోస్ట్